google-site-verification=UWT1HvOXuoHYc3pTHYovgRemmW317tUEVMirkVYs_Ks google-site-verification=UWT1HvOXuoHYc3pTHYovgRemmW317tUEVMirkVYs_Ks
top of page

కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి


ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయారని యూపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఘటన అర్ధరాత్రి ఒంటి గంట నుంచి 2 గంటల మధ్య చోటుచేసుకుంది, మరియు 25 మంది మృతుల వివరాలను గుర్తించారు. ప్రధాని మోదీ స్పందన


ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై స్పందించారు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకున్నారు.

ఆయన బాధితులకు తక్షణ సహాయం అందించాలంటూ అధికారులను ఆదేశించారు.


కుంభమేళా అథారిటీ ప్రత్యేక కార్యనిర్వాహక అధికారి ఆకాంక్ష రాణా ఈ ఘటన గురించి వివరణ ఇచ్చారు. సంగం నది వద్ద అడ్డంకి విరిగిపోవడంతో తొక్కిసలాట జరిగిందని తెలిపారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు, అయితే పరిస్థితి తీవ్రంగా లేదని స్పష్టం చేశారు.ప్రత్యక్ష సాక్షులు ఈ ఘటనలో గందరగోళం కారణంగా ఎటు వెళ్లాలో తెలియక, చీకటిలో ఉన్న చెత్త బుట్టలు కాళ్లకు తగిలి కింద పడిపోయారని తెలిపారు.

ఈ సమయంలో, భక్తులు పెద్ద సంఖ్యలో సంగం నది వద్ద చేరడంతో, మార్గాలు మూసుకుపోయాయి.


ఈ ఘటన నేపథ్యంలో, అఖిల భారతీయ అఖారా పరిషత్ (ABAP) అధ్యక్షుడు శ్రీమహంత్ రవీంద్ర పురి, ఈరోజు జరగాల్సిన అమృత్ స్నానం రద్దు చేసుకున్నారు.వారు ఫిబ్రవరి 3న మూడో అమృత స్నానం నిర్వహించనున్నట్లు తెలిపారు.జగత్గురు రాంభద్రాచార్య భక్తులకు గంగానదికి సమీపంలోని ఏ ఘాట్‌లోనైనా పవిత్ర స్నానం చేయాలని సూచించారు.

సంగం వద్ద మాత్రమే స్నానం చేయాలని భక్తులు అనుకోవద్దని తెలిపారు.

Recent Posts

See All
ఢిల్లీ ఎలక్షన్ లో బీజేపీ అధిక్యం

2025 లో ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రాథమిక ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ఆప్, కాంగ్రెస్ పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ, బీజేపీ 50...

 
 
 

Opmerkingen

Beoordeeld met 0 uit 5 sterren.
Nog geen beoordelingen

Voeg een beoordeling toe
bottom of page